కరోనా టీకా వేయించుకున్న ప్రధాని మోడీ..!!

కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం దేశంలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.కేంద్రం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తొలి విడతలో కరోనా టైములో పనిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు.

 Corona Vaccinated Pm Modi Corona Vaccine,corona Virus,modi,delhi-TeluguStop.com

మొదటి విడత సక్సెస్ కావడంతో ఈరోజునుండి రెండో విడత వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రభుత్వాలు ఆరంభించాయి.ఇలాంటి తరుణంలో దేశ ప్రధాని మోడీ తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా టీకా తొలి డోస్ తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్స్ పై అదేవిధంగా శాస్త్రవేత్తల పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.

దేశంలో ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకొని కరోన రహిత దేశంగా తీర్చిదిద్దాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు ఎయిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్‌ డోసు తీసుకున్నాను.ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి మరువలేనిది.

అర్హత ఉన్న వాళ్లందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube