తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందనే వార్తలతో సోషల్ మీడియా మోగిపోతుంది.అదీగాక ఈ రాష్ట్రంలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేసి వచ్చే నెలకల్లా కేసుల తీవ్రత తగ్గేలా చూడాలనేది ప్రభుత్వ ప్రణాళిక.
ఇందుకు గాను ఇప్పటి నుండే కరోనా వ్యాప్తిని నివారించడానికి తగిన చర్యలు చేపట్టారు అధికారులు.అంటే ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇంకా తగ్గలేదని అర్ధం అవుతుంది.
ఇదిలా ఉండగా తెలంగాణలో గడచిన 24 గంటల్లో 3,660 కొత్త కేసులు నమోదయ్యాయని, అందులో రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 217, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 574 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో కరోనా నుండి 4,826 మంది కోలుకోగా, 23 మంది మరణించినట్లుగా వెల్లడించారు.
ఇక కరోనా తగ్గుముఖం పట్టినా, పట్టకున్నా ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు తప్పక పాటించగలితే ఈ కోవిడ్ మూడో వేవ్ నుండి అతి తక్కువ నష్టంతో బయటపడవచ్చూ.లేదంటే ఇంతకంటే భయంకరమైన అనుభవాలు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర లేదు…
.