ప్రస్తుతం భారత దేశంలో కరోనా ఏవిధంగా ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా మహానగరాల్లో కరోనా పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ జర్నలిస్టు కరోనా సోకడంతో ఆయన పరిస్థితి మరీ క్షిణించడంతో ఆయన తనకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్ ఇప్పించాలని, తనని బతికించాలంటూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి అద్దం పట్టే విధంగా ఉన్న ఈ వీడియోను నెటిజన్లు అలాగే కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు.
దీంతో నిజానికి ప్రస్తుత కాలంలో అయితే కొందరు కరోనా పరిస్థితి తీవ్రంగా ఉన్న వారు వారికి సహాయం కోసం సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మహా నగరంలోని కృష్ణా నగర్ లో ఉన్న ఓ యువకుడు కరోనాతో ఇంట్లోనే చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేందర్ కు తన పరిస్థితి విషమంగా ఉందని శ్వాస కూడా ఆడడం లేదని వైద్య సహాయం అందించాలని ట్విట్టర్ ద్వారా ఆయనను కోరాడు.
దీంతో స్పందించిన మంత్రి వెంటనే అతనికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేపించేటట్లు వివరణ తెలిపారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం కేసులు నమోదు అవుతుండడంతో నగరంలోని హాస్పిటల్స్ లో ఉన్న డేటా మొత్తం పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే కరోనా పేషెంట్ కు బెడ్స్ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా సాగుతుంది.