విధి నిర్వహణలో ప్రజాప్రతినిధులు నగరం నలుమూలల పర్యటిస్తుంటారు.అలా పర్యటించిన చాలా మంది నాయకులు కరోనా బారిన పడ్డారు.
తాజాగా ఈ కోవకు చేరారు మేయర్ బొంతు రామ్మోహన్.గతంలో విధి నిర్వహణలో భాగంగా పర్యటిస్తూ ఓ టీ దుకాణం దగ్గర టీ తాగారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు డాక్టర్లు.కరోనా లక్షణాలు లేకున్నా వైరస్ ఉందని గుర్తించారు.గతంలో రెండు సార్లు కరోనా టెస్టులు చేయించుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ కు నెగిటివ్ వచ్చింది.కానీ, తాజాగా మూడోసారి కరోనా పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలింది.
దీంతో డాక్టర్లు అప్రమత్తమయ్యారు.మేయర్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ ఉంచి చికిత్స అందించారు.
మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.‘‘ఈ నెల 25వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు చేసుకున్నాం.ఇంటి సభ్యులందరికీ కరోనా నెగిటివ్ వచ్చింది.కానీ, నేను ఆరోగ్యంగా ఉన్నా రిపోర్టులో మాత్రం కరోనా పాజిటివ్ వచ్చింది.
రిపోర్టులు వచ్చినప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నాను.ఐసోలేషన్ కాలపరిమితి తర్వాత మరోమారు పరీక్షలు నిర్వహించుకుంటాను.
పూర్తిగా కోలుకున్న తర్వాత కరోనా బాధితుల కోసం ప్లాస్మాను అందిస్తాను.’’ అంటూ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, గతంలోనూ మేయర్ బొంతు రామ్మోహన్ విధి నిర్వహణలో భాగంగా నగరంలో పర్యటిస్తూ ఓ టీ షాపులో టీ తాగారు.ఆ తర్వాత దుకాణదారుడికి కరోనా రావడంతో మేయర్ మొదటిసారి కరోనా పరీక్షలు నిర్వహించుకున్నారు.
ఆ తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ పేషీలోకి సిబ్బందికి కరోనా సోకింది.అప్పుడు కూడా మేయర్ రామ్మోహన్ మరోమారు కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాడు.
తనతో పాటు తన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసినా నెగిటివ్ అని తేలింది.రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా మూడోసారి టెస్టులో కరోనా సోకిందని డాక్టర్లు వెల్లడించారు.