దేశంలో కరోనా వైరస్ కేసు లో ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాలు అలర్ట్ అవుతున్నాయి.దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.
ఇలా ఉంటే మహారాష్ట్ర అదేవిధంగా కేరళ రాష్ట్రాలలో కేసులు ఊహించని విధంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఉన్నత స్థాయి వైద్యులు అక్కడ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
కొత్త రకం వైరస్ ఆ రాష్ట్రాలలో ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేరళ మహారాష్ట్ర నుండి వస్తే కచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలో రోడ్డు మరియు రైలు అదేవిధంగా విమాన మార్గాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్ట్ లు చేయాలని ఒకవేళ అందులో పాజిటివ్ వస్తే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలని, అందులో కూడా పాజిటివ్ గా నిర్ధారణ జరిగితే వారిని హోమ్ ఐసోలేషన్ కు తరలించాలని యూపీ సర్కార్ ఆదేశించింది.
.