చైనా నుండి ప్రపంచ దేశాల్లో కరోనా ఎంట్రీ ఇచ్చిన క్రమంలో ఇండియా మొదటి దశలో అద్భుతంగా డిఫెండ్ చేసుకోగలిగింది.అన్ని రకాలుగా డెవలప్ అయిన దేశాలు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.
కానీ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఇండియాలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.వారం వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదు కావటం కాక ఈ రోజు ఒక్క రోజు రెండు లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడటంతో దేశంలో ప్రజలు బిత్తరపోతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా అనేక రాష్ట్రాలలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండగా కుంభమేళా అంటూ హరిద్వార్ లో దాదాపు 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు కరోనా నిబంధనలు పాటించకుండా బుధవారం పాల్గొన్నారు.కుంభమేళాలో శాహిస్నాన్ అనే ముఖ్యమైన కార్యక్రమంలో లక్షలాదిమంది సాధువులు గంగానదిలో రాజ స్నానం చేయడం జరిగింది.ఇంత ఒక్కసారిగా ఇంతమంది హరిద్వార్ లో పాల్గొనటంతో.ఆ ప్రాంత ప్రజలకు కరోనా టెన్షన్ స్టార్ట్ అయింది.