ఒకపక్క కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతుంటే కొందరేమో పిచ్చి పట్టినట్లు గా అప్పుడే పుట్టిన బిడ్డలకు కరోనా,కోవిడ్ అంటూ పేర్లు పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ కరోనా పిచ్చి తో ఏకంగా స్వీట్స్,కేకులు తయారుచేస్తూ జనాలను ఆకర్షించాలి అని వ్యాపారస్తులు చూస్తున్నారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఎలాంటి మందు లేకపోవడం తో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.ఈ వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కొన్ని కొన్ని చోట్ల కరోనా హెల్మెట్ లను కూడా వాడుతున్నారు. ఈ కరోనా పిచ్చి మరింత ముదిరి స్వీట్స్,కేకులు తయారు చేసే స్థాయికి చేరింది.తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఉన్న ఓ స్వీట్ షాప్ యజమాని కరోనా వైరస్ ఆకారంలో ఉన్న స్వీట్స్, కేక్లను రూపొందించి జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు.
దీంతో ఆ దుకాణంలోకి వచ్చే కస్టమర్లు ఈ స్వీట్లను చూసి అవాక్కవుతున్నారు.కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్లోనూ బెంగాల్ ప్రభుత్వం మిఠాయి షాపులకు మినాయింపు ఇచ్చింది.మిఠాయి దుకాణాలను ప్రతీరోజు నాలుగు గంటలపాటు తెరిచి ఉంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చని, కానీ సిబ్బంది సంఖ్య మాత్రం పరిమితంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.దీనితో స్వీట్ షాపులను తెరచే ఉంచుతున్నారు.దీనితో ఈ కరోనా స్వీట్స్,కేకుల కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.