తెలంగాణలో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది.ఇప్పటికే కరీంనగర్లో ఒకేసారి ముప్పై మంది ఈ వైరస్ బారిన పడ్ద విషయం తెలిసిందే.
ఇదే గాక అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నాయి.ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో మరోసారి బ్రిటన్ స్ట్రెయిన్ కలకలం రేపుతుంది.
ఆ వివరాలు చూస్తే.
తాజాగా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి దుబాయి నుండి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ నిర్దారణ అయిందట.
ఇతనికే గాక మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ నిర్దారణ అయిందట.ఆ ఇంటికి చెందిన మరో ఆరుగురికి కూడా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.
కాగా ఈ ఇద్దరిని కూడా చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారట.అయితే ఈ ఇద్దరిలో ఒకరు ఫిబ్రవరి 25న మరొకరు 27న విదేశాల నుండి బ్రిటన్ విమానాల్లో దుబాయి అక్కడి నుండి ఇండియాకు వచ్చి తమ స్వగ్రామాలకు చేరుకున్నారట.
ఇక ప్రస్తుతం వీరి కాంటాక్ట్ లిస్ట్ ను వైద్యులు సేకరిస్తున్నారు.