కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ గత ఐదు నెలలుగా ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తుంది.
ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి.ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయ్.
ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ మన భారత్ లోను విజృంభిస్తుంది.రోజు రోజుకు అత్యంత దారుణంగా పెరుగుతుంది.లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ వైరస్ అదుపులో రావటం లేదు.అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ఏపీలో జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి ద్వారా 80 మంది కరోనా వైరస్ సోకినా ఘటన కలకలం రేపుతోంది.పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన 53 తెల్ల వ్యక్తి ఈ నెల 21న కాకినాడ జిజిహెచ్ లో కరోనాతో మరణించాడని, అతని ద్వారా ఇంతమందికి కరోనా వైరస్ వచ్చిందని అధికారులు తెలిపారు.ఒక వ్యక్తి ద్వారా ఇంతమందికి కరోనా వైరస్ సోకడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
.