ప్రస్తుతం దేశంలో నిత్యం హోరెత్తుతున్న వార్తల్లో రాజకీయాల తర్వాతి స్దానంలో కరోనా న్యూస్ ఉన్నాయి.మార్నింగ్ లేచింది మొదలు పడుకునే వరకు కరోనా అనే పదాన్ని ఎన్ని సార్లు వింటున్నామో లెక్కే లేదు.
ఇకపోతే దేశంలో కరోనా వ్యాప్తి విజయవంతంగా కొనసాగుతోంది.నిజానికి ఇలా కరోనా కేసులు నమోదవడం ప్రజల వైఫల్యమే, వారి నిర్లక్షమే కారణం అనే ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా తాజాగా రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులకు వచ్చిన కరోనా పాజిటీవ్ కలకలాన్ని సృష్టిస్తుంది.
ప్రాక్టికల్స్ కోసం ఇనిస్టిట్యూట్కు వచ్చిన విద్యార్ధులకు కరోనా వైరస్ అంటుకున్నట్లు సమాచారం.
దీంతో అప్రమత్తం అయిన అధికారులు విద్యార్థులందరినీ ఐఐటీ క్యాంపస్లోని ఓ హాస్టల్ భవనంలో ఐసోలేషన్లో ఉంచారట.ఇక ఈ విషయంలో స్పందించిన ఐఐటీ ప్రతినిధి అమర్దీప్ శర్మ వైరస్ బారినపడిన, ఇతర విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.