ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది.రోజు రోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.
ఏపీలో కరోనా టెస్టులు భారీగా చేస్తున్నారు.టెస్టులు ఆ రేంజ్ లో చేస్తున్నారో అంతే స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఆదివారం తాజగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ని విడుదల చేశారు.ఏపీలో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,148 మందికి పరీక్షలు చేయగా అందులో ఏకంగా 5,041 మందికి పాజిటివ్ వచ్చాయని వైద్యులు వెల్లడించారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 49,650కు చేరిందన్నారు.
అయితే రాష్ట్రములో గడచిన 24 గంటల్లో ఏకంగా 56 మంది చనిపోయారు.దీంతో మొత్తం మరణాల సంఖ్య 642కు చేరింది.
అయితే గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, శ్రీకాకుళంలో 8 మంది, కర్నూలులో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు మరణించారని సమాచారం.
ఇకపోతే రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,106 మంది కరోనా బారి నుండి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 49,650కు పాజిటివ్ కేసులకు గాను 22,890 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని తెలియజేశారు.ఇకపోతే రాష్ట్రంలో 26,118 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.