ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.కాగా ఇప్పటికీ చాలా మందికి కరోనా వైరస్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతూ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇతరులకు హాని చేస్తున్నాయి.
తాజాగా ఇటీవలే ప్రసవించినటువంటి గర్భిణికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఈ విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులతో సహా ఆస్పత్రి నుంచి పరార్ అయింది.
వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో స్థానిక నగరానికి చెందిన ఓ మహిళ నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తమై చేరింది.
అయితే ప్రసవం జరిగిన తర్వాత మహిళకి రక్త నమూనా పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.దీంతో ఆమెను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించే లోపు విషయం తెలుసుకున్న బంధువులు మరియు బాలింత సహా అందరూ ఆసుపత్రి వదిలిపెట్టి వెళ్లిపోయారు.
దీంతో వైద్య సిబ్బంది దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు.అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని మహిళ మరియు బంధువుల ఫోటోలను తీసుకొని చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.
అలాగే కరోనా వైరస్ కి భయపడి అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇతరులకు హాని చేస్తాయని, కాబట్టి ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.