అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ దంపతుల కుమారుడు బారన్ కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని మెలానియా ట్రంప్ బుధవారం వెల్లడించారు.
అయితే, తాజాగా చేసిన కరోనా నిర్దారణ పరీక్షలో బారన్ కు కరోనా మహమ్మారి నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.బారన్ కు ప్రస్తుతం ఎటువంటి కరోనా లక్షణాలు లేవని మెలానియా వెల్లడించారు.
ఇకపోతే , అక్టోబర్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటుగా , ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం వారిద్దరూ కూడా కరోనా నుండి కోలుకున్నారు.
ట్రంప్ మూడు రోజుల పాటు సైనిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.ఆ తర్వాత వైట్ హౌస్ కు చేరుకున్న ట్రంప్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు.
కరోనా వైరస్ నుండి కోలుకోవడంతో ఆయన ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇక మెలానియా ట్రంప్ క్వారంటైన్ లోనే ఉన్నారు.ప్రస్తుతం తనకు కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, అతిత్వరలోనే ప్రథమ మహిళ బాధ్యతలను తిరిగి మొదలుపెడతానని ఆమె వెల్లడించారు.కరోనా సోకిన తరువాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని ఆమె తెలిపారు.
.