టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఏసీబీ కేసుల అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తొలుత జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆయన కోర్టు అనుమతితో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు.అచ్చెన్నాయుడుకు బుధవారం ఉదయం నుంచి జలుబు చేయడంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్టుకు లేఖ రాయాలని నిర్ణయించారు.
కాగా, అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రమేష్ ఆస్పత్రి ప్రతివారం హైకోర్టుకు బులెటిన్ అందిస్తోంది.ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు వైద్యులు కరోనా చికిత్స అందిస్తున్నారు.
ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.జూన్ 12వ తేదీన అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.