దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
కరోనా వైరస్ పట్టణాల నుండి గ్రామాలకు వ్యాపించింది.ప్రస్తుతం కరోనా వైరస్ పేరు వింటేనే చాలా మంది వణికిపోతున్నారు.
ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి ప్రముఖ వ్యక్తుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా కరోనా వైరస్ సోకింది.
కరోనా బారినపడే నేతల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది.తాజాగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈ మేరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా సోకినట్లు తన ట్విటర్ ద్వారా ఆయనే స్వయంగా తెలిపారు.అయితే ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.
అంతేకాక ఇటీవల సీఎంని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.అంతేకాకుండ వారంతా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు.
ప్రజలు కూడా కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.