ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాపుతోంది.ఈ క్రమంలోనే చాపకింద నీరులా శరవేగంగా కరోనా వైరస్ మరోసారి వ్యాప్తి చెందడంతో ఎంతోమంది మహమ్మారి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ వైరస్ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరిని వదలడం లేదు.ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోజూ ఎవరో ఒకరు ఈ వైరస్ బారిన పడుతున్న విషయం మనకు తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, తమన్ వంటి వారందరూ ఈ మహమ్మారి బారిన పడ్డారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక నటి కరోనా బారిన పడ్డారు.
గద్దల కొండ గణేష్ చిత్రంలో జర్రా.జర్రా పాటతో హాట్హాట్గా ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ డింపుల్ హాయతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా ఈ బ్యూటీ కరోనా బారిన పడ్డ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను పాజిటివ్ అని వచ్చింది.వ్యాక్సిన్ పూర్తిగా తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి బారిన పడ్డాను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను.ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు వాడటం, శానిటైజర్ లు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.