మనిషి కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం భయంతో వణికిపోయేలా చేస్తుంది.సామ్యానుల నుంచి ప్రముఖుల వరకు అందరికి సోకుతూ అందరిని వణికిపోయేలా చేస్తుంది.
మన దేశంలోనూ కరోనా ఉధృతి శరవేగంగా ఉంది.ఈ వైరస్ కు చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు.
చాలా జాగ్రత్తలు తీసుకునే రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ వైరస్ బారినపడుతున్నారు.దీంతో కరోనా పేరు చెబితే గజగజ వణికిపోతున్నారు.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ కి కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.అయితే అయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటున్నట్లు తెలిపారు.
తనతో ఇటీవలి కాలంలో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.
ఇకపోతే , ఈ నెల ప్రారంభంలో మనాలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
అయితే, సందర్భంగా ఆయనతో కలిసిన కొందరికి కరోనా పాజిటివ్ సోకిన్నట్టు తేలడంతో ముందస్తు జాగ్రత్తలల్లో భాగంగా ఈ నెల 5 న సీఎం క్వారంటైన్లోకి వెళ్లారు.అయితే తాజాగా ఆయనకి జరిపిన కరోనా నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చినట్టు తెలుస్తుంది.
.