మాయదారి కరోనా మళ్లీ ప్రజలతో ట్వంటీ ట్వంటీ ఆడటానికి సిద్దం అయినట్లుగా కనిపిస్తుందంటున్నారు ప్రస్తుత పరిస్దితులను చూస్తున్న కొందరు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కరోనా విజృంభణ ఊహించని స్దాయిలో ఊపందుకుంటుంది.
ఇకపోతే భూత్పూర్ మండలం బట్పల్లి వద్ద గల కరివేన 13 వ ప్యాకేజీలో కరోనా కలకలం సృష్టిస్తుంది.ఇక్కడ 400 మందికి పైగా కూలీలు, కార్మికులు పని చేస్తున్నారు.
కాగా వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఏకంగా మూడ్రోజుల వ్యవధిలోనే 73 మందికి కరోనా వచ్చినట్లు తేలడంతో కార్మికులు, కూలీలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు, కూలీలు ఇక్కడ పనిచేస్తుండగా వారందరిలో ప్రస్తుతం భయం నెలకొందట.
ఇదిలా ఉండగా ఇక్కడ పని చేస్తున్న వారందరికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని, అలా చేస్తే మరింత మందికి పాజిటివ్ వచ్చే అవకాశాలున్నట్లు వైద్య సిబ్బంది భావిస్తున్నారని సమాచారం.