ఏపీ లో మరో 130 పాజిటివ్ కేసులు ...! మొత్తంగా 3718 ...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేసింది.ఇక బులిటెన్ లో చూస్తే… రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 17695 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 130 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని తెలియజేశారు.

 In Andhra Pradesh 130 More Positive, Totally 3718,andhra Pradesh,corona Positive-TeluguStop.com

అంతేకాదు మరోవైపు రాష్ట్రం మొత్తంగా 30 మంది కరోనా వైరస్ బారినుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో వారు డిశ్చార్జ్ అయ్యి వారి ఇళ్లకు చేరుకున్నారు.అయితే గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో, కృష్ణాజిల్లాలో ఒక్కొక్కరు మరణించారు.

అలాగే రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన 131 మందికి పాజిటివ్ గా నిర్ధారణ చేయడం జరిగిందని తెలియజేశారు.అంతేకాకుండ ప్రస్తుతం 126 మంది అందులో యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలియజేశారు.

వారిలో నుండి ఒకరు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.అలాగే రాష్ట్రం మొత్తంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల ద్వారా ఏకంగా ఎనిమిది వందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలియజేయడం జరిగింది.

అయితే ఇందులో ప్రస్తుతం 508 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.అయితే గడచిన 24 గంటల్లో ఇందులో నుంచి 28 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.

ఒకవైపు కేసులు పెరుగుతుంటే మరోవైపు లాక్ డౌన్ సడలింపు ఎక్కువ అయిపోతున్నాయి.ఇది ఏ విధంగా కరెక్టో ప్రభుత్వానికే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube