తల్లిదండ్రులు మరణం మన కళ్ళతో చూడడం కంటే నరకయాతన మరొకటి ఉండదు.ఇంకా అలాంటిది వారు అనారోగ్యంతో చివరి క్షణాల వరకు కొట్టుమిట్టాడుతూ మరణిస్తే మనకు కలిగే బాధ మాటలలో చెప్పలేనిది.
ఇంకా అలాంటి ఘటనే పాలస్తీనాలో చోటుచేసుకుంది.ఈ ఘటన చూస్తే ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకుంటారు.
పాలస్తీనాకు చెందిన జిహాద్ ఆల్-సువైతి అనే కుర్రాడి తల్లి కరోనా వైరస్ భారిన పడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది.అయితే కరోనా వైరస్ ఆంక్షల కారణంగా అతనిని ఆస్పత్రిలోకి అనుమతించలేదు.
దీంతో మరణశయ్యపై ఉన్న తల్లిని చూసేందుకు ఆ కుర్రాడు ఆసుపత్రిపైకి ఎక్కి తల్లి ఉన్న రూమ్ కిటికీ వద్ద కూర్చున్నాడు.ఇంకా అద్దం నుంచి కొడుకు తన తల్లికి నేను ఉన్నా అమ్మ అంటూ ధైర్యం చెప్పి బతికించుకోవాలి అనుకున్నాడు.
కానీ దురదృష్టం శాత్తు అద్దంలో నుంచి కొడుకును చూసిన కాసేపటికి ఆ తల్లి ప్రాణాలు వదిలేసింది.
చివరి గడియల్లో ఇలాంటి దుస్థితిలో తల్లిని చూసుకుంటున్న ఈ కుర్రాడి ఫోటోను ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా ట్విటర్లో షేర్ చేశాడు.
దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు అంటూ నెటిజన్లు బాధతో కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫోటో చూస్తే మీకు కూడా కన్నీళ్లు ఆగవు.ఈ కోవిడ్ కాలంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో.