దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నేతలకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కేలేదు.ఒకవేళ ప్రజల పట్ల ఆసక్తి చూపిస్తున్నా అందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది.
అందుకే నేతల స్వార్ధం కోసం మాత్రమే ప్రజల్లోకి వస్తారు.
ఇకపోతే అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఊహించని విధంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సమయంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి జనం కోసం ఎంతలా ఆలోచించిన తక్కువే.ఇకపోతే సాక్షాత్తు జార్ఖండ్ వైద్యశాఖ మంత్రి ముందు ఓ కరోనా పేషెంట్ ప్రాణాలు వదలడం సంచలనంగా మారింది.
ఆ వివరాలు చూస్తే.
జార్ఖండ్లోని హజారిబాగ్కు చెందిన ఒక వ్యక్తికి ఇటీవలే కరోనా సోకడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో అతడిని రాంచీలోని సదర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.కానీ ఇతన్ని చేర్చుకోవడానికి అంగీకరించని వైద్యులు ఆరోగ్య శాఖ మంత్రి తనిఖీలకు వస్తున్నారనే సాకుతో బయటే ఉంచారట.
కాగా ఈ ఆస్పత్రికి వచ్చిన వైద్యశాఖ మంత్రి బన్నా దాస్ గుప్తా లోపల తనిఖీల పేరుతో సాయంత్రం వరకు ఉండటంతో ఆ కరోనా రోగి చికిత్స అందక మరణించాడట.దీంతో ఆ వ్యక్తి కూతురు మేము డాక్టర్ల కోసం అరుస్తూనే ఉన్నాం.కానీ చికిత్స అందించడానికి ఒక్క డాక్టర్ కూడా ముందుకు రాలేదు.సకాలంలో వైద్యం అందక ఆయన మరణించాడు.మీరు నా తండ్రిని తిరిగి ఇవ్వగలరా అని మంత్రిని ఉద్దేశిస్తూ మృతుడి కూతురు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, దీనిపై బన్నా దాస్ గుప్తా స్పందిస్తూ, సమస్యలు ప్రతిచోటా ఉంటాయని, వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం గమనార్హం.
చూశార ప్రాణాలు పోతున్న పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యం.