రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ముందే ఓ నిండు ప్రాణం బలి.. ఇది మనదేశ దౌర్భాగ్యం.. ?

దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నేతలకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కేలేదు.ఒకవేళ ప్రజల పట్ల ఆసక్తి చూపిస్తున్నా అందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది.

 Corona Patient Died During Jharkhand State Health Minister Banna Das Gupta Inspe-TeluguStop.com

అందుకే నేతల స్వార్ధం కోసం మాత్రమే ప్రజల్లోకి వస్తారు.

ఇకపోతే అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఊహించని విధంగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సమయంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి జనం కోసం ఎంతలా ఆలోచించిన తక్కువే.ఇకపోతే సాక్షాత్తు జార్ఖండ్‌ వైద్యశాఖ మంత్రి ముందు ఓ కరోనా పేషెంట్ ప్రాణాలు వదలడం సంచలనంగా మారింది.

ఆ వివరాలు చూస్తే.

జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన ఒక వ్యక్తికి ఇటీవలే కరోనా సోకడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో అతడిని రాంచీలోని సదర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.కానీ ఇతన్ని చేర్చుకోవడానికి అంగీకరించని వైద్యులు ఆరోగ్య శాఖ మంత్రి తనిఖీలకు వస్తున్నారనే సాకుతో బయటే ఉంచారట.

Telugu Covid, Helth, Jharkhand, Jharkhandbanna, Ranchi Sadar-Latest News - Telug

కాగా ఈ ఆస్పత్రికి వచ్చిన వైద్యశాఖ మంత్రి బన్నా దాస్ గుప్తా లోపల తనిఖీల పేరుతో సాయంత్రం వరకు ఉండటంతో ఆ కరోనా రోగి చికిత్స అందక మరణించాడట.దీంతో ఆ వ్యక్తి కూతురు మేము డాక్టర్ల కోసం అరుస్తూనే ఉన్నాం.కానీ చికిత్స అందించడానికి ఒక్క డాక్టర్ కూడా ముందుకు రాలేదు.సకాలంలో వైద్యం అందక ఆయన మరణించాడు.మీరు నా తండ్రిని తిరిగి ఇవ్వగలరా అని మంత్రిని ఉద్దేశిస్తూ మృతుడి కూతురు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా, దీనిపై బన్నా దాస్ గుప్తా స్పందిస్తూ, సమస్యలు ప్రతిచోటా ఉంటాయని, వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం గమనార్హం.

చూశార ప్రాణాలు పోతున్న పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube