కరోనా వైరస్.ప్రపంచ ప్రజల విధానాన్ని మార్చేసింది.
ఎక్కడ చైనీస్ వైరస్ ఓ ఏమో కానీ మనుషుల అంతక్రియలు కూడా వారి సాంప్రదాయంగా జరగనివ్వడం లేదు.ఎంత దారుణం ఇది ? కరోనా వైరస్ తో ఎవరు చనిపోయిన వారిని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలెం.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా మృతుదేహాలను అంబులెన్స్ లో తీసుకెళ్లి అయినా చేసేవారు.కానీ ఇప్పుడు ఒక జంతువుల మృతదేహాలు తీసుకెళ్లినట్టు ఆటోలో తీసుకెళ్లిన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కరోనా వైరస్ తో మృతి చెందిన ఓ వ్యక్తి మృతుదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించారు.
ఇంకా ఈ దారుణమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.అయితే కరోనా వైరస్ తో మృతి చెందిన వారి మృతుదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది.
కానీ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు దారుణంగా వ్యవహరించారు.ఆటోలో కరోనా రోగి మృతుదేహాన్ని స్మశాన వాటికకు తరలించి డ్రైవర్ తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా పీపీఈ కిట్లు ధరించకుండా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ విషయంపై వైద్య సిబ్బంది మాట్లాడుతూ.ఓకేసారి ముగ్గురు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్ ఉండడంతో ఇలా చేసినట్టు చెప్పారు.కాగా ఆటోలో కోవిడ్ మృతదేహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.