తెలంగాణలోకరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది.నిన్నటి వరకూ తక్కువగా నమోదైన కేసులు నేడు మళ్లీ పెరిగాయి.
అన్ లాక్ ప్రక్రియతో అన్ని వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి.నగరంలో రద్దీ పెరగడంతో కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతోందని ప్రముఖులు తెలుపుతున్నారు.
ప్రభుత్వం కరోనాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంద వరకు కరోనా నిబంధనలకు కఠినం చేయాలని సూచిస్తున్నారు.
తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,949 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,99,276కి చేరింది.
నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,163కి చేరింది.
అయితే రోజుకు నమోదవుతున్న కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పవచ్చు.గడిచిన 24 గంటల్లో 2,366 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.
దీంతో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 1,70,212కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
వీరిలో 22,816 మంది హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.ఇప్పటివరకూ రాష్ట్రంలో 32,05,249 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.తెలంగాణలో మరణాల రేటు 0.58 శాతంగా ఉందని, రికవరీ రేటు 85.41 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ ప్రకటించింది.కొన్ని జిల్లాలవారీగా కరోనా కొత్త కేసుల వివరాలు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 291, రంగారెడ్డిలో 156, మేడ్చల్ మల్కాజిగిరిలో 150, కరీంనగర్ లో 114, నల్గొండలో 124, ఖమ్మంలో 85, సిద్ధిపేటలో 76, సూర్యపేటలో 65, రాజన్న సిరిసిల్లలో 55, నిజామాబాద్ లో 66 కరోనా కేసులు నమోదయ్యాయి.