నిజంగా పగవాళ్లకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు.ఈ లాక్ డౌన్ కారణంగా కన్న తండ్రి కూతురు చివరి చూపుకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది.
కరోనా మహమ్మారి ఒకపక్క ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూనే మరోపక్క కొంతమందికి అంతులేని విషాదాన్ని కూడా మిగుల్చుతోంది.కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం తో దుబాయ్ లో ఉంటున్న కన్నతండ్రి కూతురు చివరి చూపులకు కూడా నోచుకోలేకపోయాడు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఈ లాక్ డౌన్ విధించడం తో బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఎంతోమంది స్వస్థలాలకు రాలేక అక్కడే ఇరుక్కుపోయారు. జగిత్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనారోగ్యం తో మృతి చెందితే చివరిచూపునకు నోచుకోలేకపోయాడో తండ్రి.వివరాల్లోకి వెళితే.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరుకి చెందిన పాలాజీ భాస్కర్, సునీత దంపతులకు సాహిత్య(11) అనే కుమార్తె ఉంది.అయితే సాహిత్య కొంతకాలంగా తీవ్ర మధుమేహ వ్యాధితో బాధపడుతుండడం తో ఆమె కు వైద్య పరంగా చాలా ఖర్చు చేయాల్సి రావడం తో భాస్కర్ అప్పులు పాలయ్యాడు.
దీనితో ఆ అప్పులను తీర్చడం కోసం,అలానే కూతురు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం కోసం అని ఐదు నెలల క్రితం దుబాయ్ కి వెళ్ళాడు.అయితే సాహిత్య ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో శుక్రవారం మృతిచెందింది.
దీనితో దుబాయిలో ఉన్న తండ్రి భాస్కర్కు ఈ విషయాన్ని చెప్పగా,కూతురుని చివరి చూపు చూడడం కోసం అని స్వస్థలానికి రావడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికి లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు.దీనితో ఏమి చేయాలని పరిస్థితుల్లో భాస్కర్ బంధువులు వీడియో కాల్ చేసి సాహిత్య అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేసినల్టు తెలుస్తుంది.