కరోనా ఈ పేరు చెప్పగానే వణికిపోయిన జనం ప్రస్తుత పరిస్దితుల్లో ఈ వైరస్ను లెక్కే చేయడం లేదు.కరోనా కోత్తిమీర కట్టనా అంటూ ఫుల్గా పెరిగిన కాన్ఫిడెంట్స్తో ఎలాంటి భయం లేకుండా నిత్య జీవితంలో సాగిపోతున్నారు.
కానీ ఈ వైరస్ ఊరుకుంటుందా మళ్లీ ఒక్క సారి ఈ ప్రజల ఒంట్లో భయాన్ని చూడాలని ముచ్చట పడుతుంది కావచ్చూ.అందుకే వ్యాపించడం మొదలు పెట్టింది.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించ వలసిన పరిస్థితులు తలెత్తుతుండగా, ఇక థానే జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఇక్కడ లాక్డౌన్ విధించారు.ఇదే కాకుండా థానే నగరం మొత్తం మీద 16 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు.
ఈ ప్రాంతాల్లో మార్చి 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.ఇంతకు ముందు అమలులో ఉన్న అన్ని ఆంక్షలు ప్రస్తుత సమయంలో కూడా అమలులో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.