తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజూ 2 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,273 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,62,844 కి చేరింది.2,260 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,31,447 కి చేరింది.
నిన్న ఒక్కరోజే 12 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.దీంతో మరణించిన వారి సంఖ్య 996కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 30,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.వీరిలో 23,569 మంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.మంగళవారం 55,636 శాంపిళ్లు పరీక్షించగా.883 పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది.ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తంగా 22,76,222 కరోనా పరీక్షలు నిర్వహించారు.అయితే రాష్ట్రంలో 0.61 శాతం మరణాల రేటు ఉండగా.రికవరీ రేటు 80.71 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.కొన్ని జిల్లాల వారీగా కరోనా కేసులు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 325, రంగారెడ్డి 185, మేడ్చల్ మల్కాజిగిరి 164, నల్గొండ 175, కరీంనగర్ 122, వరంగల్ 114 కరోనా కేసులు నమోదయ్యాయి.