తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది.అయితే గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.
ఇక ఈ మహమ్మారి కారణంగా 10 మంది మృతి చెందారని వైద్యులు వెల్లడించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,884కి చేరుకుంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 866కి చేరింది.అయితే గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి నుండి 2,011 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 1,02,024కు చేరింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32,994 కరోనా కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.
అంతేకాక 25,730 మంది హోం క్వారంటైన్, ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.ఇక గడచిన 24 గంటల్లో హైదరాబాద్లో ఎక్కువగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని వైద్యులు వెల్లడించారు.