ఏపీలో కరోనా హైరానా.. ఒక్కరోజే !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.దేశంలోనూ అదే పరిస్థితి.

 Ap, Corona, Cases, Death-TeluguStop.com

రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నారు.కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.దేశంలో 30 లక్షలకు దాటింది.

రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.

రోజూ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.గడిచిన 24 గంట్లో రాష్ట్రవ్యాప్తంగా 8601 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,61,712 కు చేరింది.కేసుల సంఖ్యతో పాటు మరణించిన వారి సంఖ్య అత్యధికంగా నమోదైంది.

గడిచిన 24 గంటల్లో 86 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 3368 కి చేరింది.

కరోనా నుంచి కోలుకుని 8,741 మంది డిశ్చార్జ్ అవ్వడంతో ఇప్పటివరకు కరోనాతో క్యూర్ అయిన వారి సంఖ్య 2,68,828కి పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రంలో 89,516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube