కరోనా హైరానా : పోలీస్ శాఖలో 4259 మందికి !

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 Telangana, Police, Corona-TeluguStop.com

కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు పెరుగుతూనే వస్తోంది.ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూనే ఉంది.

ఈ వైరస్ అన్ని శాఖల అధికారులను విడిచి పెట్టడం లేదు.ఇప్పటివరకు తెలంగాణలో 4259 మంది పోలీసులకు కరోనా సోకింది.

వీరిలో ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే పోలీసులే అధికం.నగర పరిధిలో 1946 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 39 మరణించగా.వీరిలో సిటీ కమిషనరేట్ పరిధిలోనే 26 మంది చనిపోయారు.

కరోనా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు.వైరస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ముందుండి విధులు నిర్వహిస్తున్నారు.దీని వల్లనే పోలీస్ శాఖలో కరోనా విలయతాండవం చేస్తోంది.మరణాల సంఖ్య కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది.

పోలీస్ శాఖలో కరోనా బారిన పడి కోలుకున్న వారు తిరిగి విధుల్లోకి చేరుతున్నారు.వారిని అధికారులు, సహచర సిబ్బంది ఘనంగా సన్మానిస్తూ విధుల్లోకి ఆహ్వానిస్తున్నారు.

ఇప్పటివరకూ హైదరాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, వరంగల్, నల్లొండ జిల్లాల్లోని పోలీసులు అధికంగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube