కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మహారాష్ట్రలో బాగా చూపిస్తుంది.వేల కొద్దీ కేసులు వస్తున్న మహారాష్ట్రలో గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న ప్రక్రియ చేపడుతుంది.
గ్రామాల్లో కరోనా నియంత్రణని కోసం వినూత్న పోటీ ప్రవేశపెట్టింది.కరోనా ఫ్రీ విలేజ్ ఏర్పాటు చేస్తే ఆ విలేజ్ కి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నట్టు ప్రకటించారు.
కరోనాపై అవగాహన కల్పించడమే కాకుండా వైర్స్ కట్టడి కోసం ఈ పోటీ ప్రారంభిస్తున్నామని అన్నారు సిఎం ఉద్దవ్ ఠాక్రే.
కరోనా ఫ్రీ విలేజ్ పోటీ వైరస్ కట్టడిలో ఒక భాగమని అన్నారు రాస్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్.
ఈ ప్రక్రియలో కరోనా ఫ్రీ విలేజ్ గా మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రైజ్ మనీ ఇవ్వబడుతుందని అన్నారు.ఫస్ట్ ప్రైజ్ గా 50 లక్షలు.రెండో బహుమతిగా 25 లక్షలు.3వ బహుమతిగా 15 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారని తెలుస్తుంది.రాష్ట్రంలో 6 రెవిన్యూ విభాగాలు ఉండగా మొత్తం 18 బహుమతులు ఇవ్వాల్సి ఉంటుందని.మొత్తంగా 5.4 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు.గెలిచిన బహుమతితో గ్రామాభివృద్ధికి ఉపగోగించవచ్చని తెలిపారు.
గ్రామాల్లో యువత కరోనా కట్టడికి నడుం కట్టాలని వారి ద్వారానే ఈ ప్రైజ్ మనీని అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.