మహారాష్ట్రలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది.రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్నాయి.అయితే మరోవైపు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ముందుండి విధులు నిర్వర్తిస్తోన్న పోలీసు శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది.
రాష్ట్రంలో ఆదివారం వరకు 9,566 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.అయితే వీరిలో 103 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా 103 మంది మృతి చెందగా.వీరిలో 9 మంది ఉన్నతాధికారులు, 94 మంది సిబ్బంది ఉన్నారు.వైరస్ సోకిన మొత్తం సిబ్బందిలో 7,534 మంది ఇప్పటికే కోలుకోగా.మరో 1,929 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
కాగా, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 9,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల 31 వేలు దాటింది.
వీరిలో ఇప్పటికే 15,316 మంది మృతి చెందగా.శనివారం ఒక్కరోజే 322 మంది మరణించారు.