తెలంగాణలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుంది.రాష్ట్రంలో రోజుకు వెయ్యికి పైగా కేసులు వస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడం లేదు.ఈ మహమ్మారి నగరం నుండి పల్లెల బాట పడింది.
దింతో ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా రోజు రోజుకు పెరిగిపోతుంది.తాజగా సంగారెడ్డిలో ఓకే కుటుంబానికి చెందినా 12మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దింతో ఈ వార్త ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పట్టణంలోని ఓ కుటుంబంలో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శనివారం అధికారులు వెల్లడించారు.
దీనికి సంబంధించిన వివరాలను మున్సిపల్ కమిషనర్ సుజాత తెలియజేశారు.అయితే పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు.
అయితే వారిది ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులందరికి ఈ మహమ్మారి వ్యాపించింది.
అయితే వారు కరోనా లక్షణాలు ఉన్నయామో అనుమానంతో హైదరాబాద్ లోని ఒక్క ప్రవేట్ ఆసుపత్రికి వచ్చారు.
ఆ కుటుంబంలో 14 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 12మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు.విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వాళ్ళ కాలనీలో రసాయనాలతో పిచ్చికారీ చేయించారు.
ఆ కుటుంబం వారికీ కరోనా పాజిటివ్ రావంతో స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. మున్సిపల్ కమిషనర్ సుజాత ఆ కాలనీ ప్రజలకు తగు జాగ్రత్తలను వెల్లడించారు.
అత్యవసరంలో తప్పితే బయటకు రావొద్దు అన్నారు.మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.