దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
దీంతో పాజిటివ్ కేసులు ఇటీవల పెరిగిన మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి చోట్ల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర లో కొన్ని జిల్లాలలో లాక్ డౌన్ విధించగా, పూణే వంటి చోట్ల రాత్రిపూట బయట తిరగకూడదు అంటూ కర్ఫ్యూ విధించడం జరిగింది.
ఇదిలా ఉంటే నాగపూర్ లో మార్చి 7వ తేదీ వరకు స్కూల్స్ మరియు కాలేజీలు ఓపెన్ చేయకూడదు అని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఉన్న కొద్ది కేసులు పెరుగుతూ ఉండటంతో ముందు జాగ్రత్తగా సీఎం ఉద్ధవ్ థాక్రే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
.