చైనాని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా విస్తరిస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.విదేశాలకి వెళ్ళిన వచ్చిన వారి ద్వారా నగరంలోకి కరోనా వైరస్ వచ్చింది.
అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ లో రెండు, మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇక వందల సంఖ్యలో అనుమానితులు టెస్ట్ లు చేసుకుంటున్నారు.
తాజాగా మైండ్ స్పేస్ అనే సాఫ్ట్ కంపెనీలో ఫారిన్ వెళ్లి వచ్చిన ఒక అమ్మాయికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు కంపెనీలో ఉన్న వెయ్యి మంది ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు.అయితే ఆమెతో తిరిగిన చాలా మంది కరోనా అనుమానంతో హాస్పిటల్స్ వైపు పరుగులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే గుంపులు, గుంపులు గా ఉన్న చోట, సమూహాలు ఉన్నచోట ఈ కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతూ ఉన్నారు.ఇక హైదరాబాద్ లో దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో పూర్తిగా ఒక అంచనాకి రాలేకపోతున్నారు.
అయితే ఇప్పుడు ఈ కరోనా భయం టాలీవుడ్ ని తాకినట్లు తెలుస్తుంది.సినిమా షూటింగ్ లు అంతే వందల సంఖ్యలో పని చేస్తూ ఉంటారు.వారంతా ఎక్కడెక్కడి నుంచో వస్తారు.అందుకే షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే నిర్మాతలకి సూచనలు వెళ్ళినట్లు తెలుస్తుంది.
వీలైతే కొద్ది రోజుల పాటు షూటింగ్ లు నిలిపేయాలని కూడా ఆలోచిస్తున్నారని సమాచారం.దీనిపై అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోకపోయిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.