మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొంది కొన్నాళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మహానుభావుడు’.మెహ్రీన్ హీరోయిన్గా నటించిన ఆ సినిమా యావరేజ్గా నిలిచింది.
కమర్షియల్గా పర్వాలేదు అనిపించినా కూడా అంచనాలను అందుకోలేక పోయింది.ఆ సినిమాలో హీరో మరీ అతి చేశాడు అంటూ విమర్శలు వచ్చాయి.
కాని ఇప్పుడు అందరు అలాగే ఉండాలని, అలాగే చేయాలని తమకు తాముగా అనుకుంటున్నారు.
మహానుభావుడు చిత్రంలో హీరో శర్వానంద్ ఏం చేసినా చేతులు కడుక్కుంటూ, చాలా శుభ్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు.అన్ని విధాలుగా పరిశుభ్రత పాటించడం అతడికి అలవాటు.అపరిశుభ్రంగా ఉంటే అతడు వెంటనే సిక్ అవుతాడు.
అందుకే ప్రతి చోట కూడా అతడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు.ఇప్పుడు అలా ఉండక పోతే కరోనా వస్తుంది అంటున్నారు.
ప్రతి ఒక్కరు కూడా శర్వానంద్లా మారిపోతున్నారు.
కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా జనాలు ఆసక్తి చూపడం లేదు.ఎవరైనా దగ్గుతున్నారు లేదా తుమ్ముతున్నారు అంటూ అంత దూరం పారిపోతున్నారు.అసలు జనాల్లోకి వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.
ప్రతి ఒక్కరు కూడా శర్వానంద్లు అవ్వడంతో కరోనా కాస్త అయినా తగ్గుముఖం పడుతుందని, రాకుండా ఉంటుందని వైధ్యులు అంటున్నారు.తాజాగా మారుతి కూడా ఇదే విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ప్రతి ఒక్కరు కూడా మహానుభావుడు అవ్వండి.లేదంటే కరోనా మిమ్ములను ఇబ్బంది పెడుతుంది అంటూ మారుతి హెచ్చరించాడు.