కరోనా వైరస్ కన్నా జనాల్లో పెరుగుతున్న భయాలతో మరిన్ని మరణాలు చోటుచేసుకుంటున్నాయి.మనం ఎలా ఉన్నాము అనడం కన్నా మన పక్క వారిని చూసి భయపడే రోజులు ఈ కరోనా వల్ల దాపురించాయి.
ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో మన సమీపంలో ఎవరైనా తుమ్మినా,దగ్గినా కూడా భయపడిపోతున్నారు.ఇంతక ముందు పక్కన వాడు తుమ్మినా,దగ్గినా పట్టించుకోని జనాలు ఇప్పుడు ఎవరైనా దగ్గరగా వచ్చి అలాంటి పనులు చేసారో ఇక అంతే వారితో గొడవకు దిగడమో లేదంటే కొట్టడానికి వెళ్లడమో చేసేస్తున్నారు.అయితే తాజాగా స్నేహితుడు పదే పదే దగ్గుతున్నాడు అని ఒక వ్యక్తి ఏకంగా అతడిని తుపాకీ తో కాల్చిన ఘటన చోటుచేసుకుంది.ఇది ఢిల్లీ నోయిడా లో చోటుచేసుకుంది.
దయానగర్కు చెందిన ప్రశాంత్ సింగ్(25), జై వీర్సింగ్ (30) వ్యవసాయం చేస్తుంటారు.మంగళవారం రాత్రి ప్రశాంత్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి దయానగర్ ఆలయంలో లూడో ఆడుతున్నారు.
అదే సమయంలో అక్కడికి జైవీర్ సింగ్ వచ్చాడు.జైవీర్ సింగ్ ను చూసిన ప్రశాంత్ పదేపదే దగ్గడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
తనను చూసి కావాలనే ప్రశాంత్ దగ్గుతున్నాడని జైవీర్ సింగ్ గొడవకు దిగాడు.
గొడవ పెద్దది కావడంతో జై వీర్ సింగ్ జేబులోంచి తుపాకి తీసి ప్రశాంత్ పై కాల్పులు జరిపాడు.అయితే ఈ ఘటన లో గాయపడిన ప్రశాంత్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.