ప్రస్తుతం భారతదేశంలో కరోనా మహమ్మారి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ మహమ్మారి దేశంలో పని చేస్తున్న తరుణంలో అనేక మంది జీవితాలు రోడ్డున పడ్డాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూసివేయడంతో అనేక మంది జీవన ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.పొట్టకూటి కోసం నగరాలకు వచ్చిన వారు కూడా పనులు లేకపోవడంతో తిరిగి వెళ్లే వారు అనేకం.
అయితే తాజాగా ఓ మహిళ అంబులెన్స్ డ్రైవర్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.సదరు మహిళ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరానికి చెందిన దీపా జోసఫ్.కరోనా సంక్షోభం ముందు ఓ కళాశాలలో బస్సు డ్రైవర్ గా పని చేసేది.
అయితే కరోనా వైరస్ నేపథ్యంలో మొదలైన లాక్ డౌన్ కారణంతో విద్యా సంస్థలు పూర్తిగా మూసివేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో సదరు మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఇక తనకు వచ్చిన పనిని ఎక్కడైనా చేయాలనే ఉద్దేశ్యంతో… తాను తాజాగా అంబులెన్స్ డ్రైవర్ గా మారిపోయింది.
ఇందుకు సంబంధించి దీప మాట్లాడుతూ… తాను కాలేజీ లో పని చేస్తూ ఉండేదాన్ని అని, అయితే కరోనా నేపథ్యంలో కాలేజీ మూసివేయడంతో తన ఉద్యోగం పోయిందని తెలిపింది.
దింతో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో తాను తన కుటుంబాన్ని పోషించడం కోసం అంబులెన్స్ డ్రైవర్ గా మారానని తెలియజేసింది.దీపకు 8వ తరగతి చదువుతున్న కుమార్తె, పదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు.
తన కుటుంబం తనకు ఎంతో మద్దతిస్తుందని ఆమె తెలియజేశారు.