దేశంలో రెండో సారి కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.చాలా రాష్ట్రాలలో కేసులు ఊహించని విధంగా పెరుగుతూ ఉండటంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి.
కరోనా ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయటానికి రెడీ అవుతూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త వహిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు తమ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే కచ్చితంగా ఈపాస్ తప్పనిసరి అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు తాజాగా జారీ చేయడం జరిగింది.
తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్న కొద్దీ కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, పుదుచెర్రీ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చే వారికి ఈపాస్ మినహాయింపు ఇచ్చింది తమిళనాడు సర్కార్.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి అదేవిధంగా విదేశాల నుంచి వచ్చే వారు మరియు తమిళనాడు వైపు నుండి వెళ్లే వారు కచ్చితంగా ఈపాస్ చూపించాలని పేర్కొంది.
.