కరోనా వైరస్ తో చైనా గడగడలాడుతుంది.కరోనా కు గురై ఎంతో మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్ ను నిర్మూలించడానికి చైనా గట్టి ప్రయత్నాలే చేస్తుంది.కానీ ఇంతవరకు దానికి సరైన మెడిసిన్ ను మాత్రం కనిపెట్టలేకపోయింది.
కరోనా ప్రభావం వలన ధిల్లీ లో మార్చి 15 నుండి 26 వరకు జరగవలిసిన షూటింగ్ ప్రపంచ కప్ కు కరోనా ప్రభావిత దేశాలు పాల్గొనడంలేదు.ఈ విషయాన్ని జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడు రనీందర్ సింగ్ తెలియజేశాడు.
చైనా లో కరోనా వ్యాప్తిచెందటం వలన ఆ దేశం స్వతహాగా ఈ నిర్ణయం తీసుకుంది.మొత్తానికి ఈ టోర్నీ నుండి తప్పుకుంటున్న దేశాలు చైనా తో పాటుగా తైవాన్, హాంగ్కాంగ్, మకావు, ఉత్తర కొరియా, తుర్కమెనిస్థాన్ వంటి దేశాలకు చెందినా క్రీడాకారులు పాల్గొనడంలేదు
భారత ప్రభుత్వం కూడా కరోనా ప్రభావిత దేశాలకు విసా ఇచ్చేందుకు నిరాకరించింది.
అలాగే ఈ టోర్నీ లో పాకిస్తాన్ కు చెందిన షూటర్స్ పాల్గొనడంలేదని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు తెలియజేశాడు.కరోనా ప్రభావం వలన ప్రపంచ కప్ షూటింగ్ విభాగపు పోటీలపై ఎవరు మక్కువ చూపడం లేదని తెలుస్తుంది.