కరోనా వైరస్ కారణంగా అమెరికా అల్లాడి పోతోంది.అగ్ర రాజ్యంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా అమెరికన్స్ ఊహించి ఉండరేమో.
ఎలాంటి విపత్తునైనా సమర్ధవంతంగా ఎదుర్కొనే అమెరికా ప్రస్తుతం కరోనా కారణంగా కంగారు పడిపోతోంది.ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదైన ఏకైక దేశంగా రికార్డులకి కూడా ఎక్కింది.
రోజు రోజుకి వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.గతంలో ఒక్క న్యూయార్క్ మీదనే ప్రభావం చూపిన కరోనా ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.
అమెరికాలోని 50 రాష్ట్రాలలో సుమారు 40 రాష్ట్రాలు కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నాయి.కేవలం 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 55 వేలకి పైగా కేసులు నమోదు అయ్యాయి.
రెండవ రోజు కూడా 50 వేల కేసులు నమోదు కావడంతో అమెరికన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు.అల్లాడి పోతున్నారు.ముఖ్యంగా ఈ వైరస్ కాలిఫోర్నియా ,అరోజోనా, ఫ్లోరిడా, టెక్సాస్ , రాష్ట్రాలలో రికార్డ్ స్థాయిలో వేగంగా విస్తరిస్తోంది.ప్రస్తుతం ఈ పరిస్థితికి కారణం.
అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లను సడలించడమేనని అంటున్నారు నిపుణులు.లాక్ డౌన్ కొంత కాలం సడలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని,ప్రభుత్వం ఆర్ధిక పరమైన అంశాలని దృష్టిలో పెట్టుకుందే కానీ ప్రజల ప్రాణాల విషయాన్ని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు సామాజిక కార్యకర్తలు.
వైద్య నిపుణుల అంచనాల ప్రకారం ప్రభుత్వం కఠినమైన చర్యలు గనుకా చేపట్టక పొతే అమెరికా మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్దంగా ఉండాలని అంటున్నారు.ఒక పక్క ఉద్యోగాలు కోల్పోయి, మరో పక్క వ్యాపారాలు లేక, చేతిలో డబ్బులు లేక ప్రభుత్వాల నుంచీ సాయం అందక ఎంతో మంది అమెరికన్స్ అల్లాడి పోతున్నారని మీడియా మండిపడుతోంది.