అల్ట్రావైలెట్-సీ కిరణాలతో కరోనా ఖతం : జపాన్ శాస్ట్రవేత్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు వ్యాక్సిన్లను కనుగొని క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు.

 Corona, Cutting, Ultraviolet-c Rays, Japanese, Scientists,world-TeluguStop.com

వైరస్ ను నియంత్రించడానికి అనేక మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా కరోనాను ఖతం చేసేందుకు కొత్త ప్రయోగాన్ని కనుగొన్నారు.222 నానో మీటర్ల తరంగ ధైర్ఘ్యం కలిగిన అతినీలలోహిత కిరణాలతో (అల్ట్రావైలెట్-సీ) కరోనా వైరస్ ను నాశనం చేయవచ్చని గుర్తించారు.ఈ కిరణాల ద్వారా మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తోంది.

అల్ట్రావైలెట్-సీ కిరణాలు సార్స్ సీఓవీ-2ను పోలిన వైరస్ ను ఈ కిరణాలు చంపేస్తుందని హిరోషిమా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పలు అధ్యాయాలు జరిపి తేల్చి చెప్పారు.ఈ ప్రయోగంలో కరోనాను చంపేస్తుందని తెలిపారు.కరోనా వైరస్ పై 222 ఎన్ఎం యూవీసీని 30 సెకన్ల పాటు ఎక్స్పోజర్ చేయడంతో 99.7 శాతం సార్స్ సీఓవీ-2 వైరస్ చనిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ కిరణాల వల్ల మనుషుల చర్మం, కన్ను, బయటి పొరకు ఎలాంటి హాని జరగదని, జీవ కణాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు.పరిశోధకులు జరిపిన అధ్యయనానికి సంబంధించి అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రచురించింది.

ఈ విధానాన్ని ఆస్పత్రుల్లో సహా ఇతర కేంద్రాల్లో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube