సెంట్రల్ జైలులో కరోనా కలకలం.. రిమాండ్ ఖైదీలకు పాజిటీవ్.. !

దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా మరోసారి చిత్రవిచిత్రాలు పడుతుంది.ఇప్పటికే కరోనా చేస్తున్న దాడికి ప్రజల్లో భయం లేకున్నా భారీగా కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి.

 Rajamahendravaram Central Jail Prisoners Infected With Corona,rajamahendravaram,-TeluguStop.com

ప్రజలు ఎవరిపని వారు చేసుకుంటున్న కరోనా నిబంధలను మాత్రం పట్టించుకోవడం లేదు.

ఫలితంగా కరోనా ఇష్టరాజ్యంగా వ్యాపిస్తుంది.

ఇకపోతే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలులోని 8 మంది రిమాండ్ ఖైదీలు కరోనా బారినపడినట్లుగా అధికారులు వెల్లడించారు.కాగా జైలులో ఉన్న ముగ్గురు ఖైదీలు గురువారం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు గమనించిన అధికారులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటీవ్ అని తేలిందట.

అలాగే శుక్రవారం మరో 8 మందికి పరీక్షలు చేయించగా వారిలో కూడా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్దారణ జరిగినట్లుగా రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.ఇక వీరందరిని నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో మిగతా ఖైదీలందరికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube