కరోనా వైరస్ పై ఇప్పటికే పలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు కీలక సమాచారాన్ని తెలియజేశారు.కరోనా వ్యాప్తిపై, కరోనా లక్షణాల గురించి, అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగానే హెచ్చరించింది.
ఇందులో కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం, చలి, వణకడం, ఒళ్ల నొప్పులు వంటివి వస్తుంటాయి.దీంతోపాటుగా ఏ లక్షణాలు లేకున్నా కరోనా వైరస్ సోకుతుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే.
వైరస్ మానవ శరీరంలో ప్రవేశించి ఈ లక్షణాలు కనిపించడానికి దాదాపుగా 5రోజుల పాటు సమయం తీసుకుంటుందని, మరికొందరికి ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చని తెలిపారు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య అధికారులు రాష్ట్రంలో కరోనా లక్షణాలు లేని వారిలో కరోనాను గుర్తించారు.
ఏకంగా కరోనా లక్షణాలు లేని లక్ష మంది కరోనా బాధితుల ఉన్నారని, దానికి సంబంధించి రికార్డులు కూడా ఉన్నాయని పేర్కొంది.సోమవారం నాటికి రాష్ట్రంలో 1,45,163 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
ఇందులో కరోనా లక్షణాలు లేకుండా వైరస్ ఉన్న కేసులు 1,00,162గా గుర్తించారు.దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ బులిటెన్ ను విడుదల చేశారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 18,90,554 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు.మంగళవారం రోజు 62,649 శాంపిల్స్ పరీక్షించగా… ఇందులో 2479 పాజిటివ్ కేసులు వచ్చాయని, మరో 2430 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.