తెలంగాణలో కరోనా కేసులు ఈ రోజు తక్కువగా నమోదయ్యాయి.గత కొద్ది రోజులుగా 2వేలకు పైగా నమోదైన కేసులు నేడు వెయ్యికి పైగా నమోదయ్యాయి.
అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో పాటు హైదరాబాద్ నగరంలో సిటీ సర్వీసు బస్సులు స్టార్ట్ అవడంతో ప్రయాణాలు పెరిగి కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,967 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,85,833కు చేరింది.
నిన్న ఒక్కరోజే 2,058 మంది కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దీంతో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 1,54,499కి చేరింది.
కరోనా బారిన పడి 9 మంది ప్రాణాలు కోల్పోగా.ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,100కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 30,234 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉందని, రికవరీ రేటు 82.939 శాతంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 50,108 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.ఇప్పటివరకూ 28,50,869 నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 297, కరీంనగర్ లో 152, మేడ్చల్ మల్కాజిగిరిలో 137, నల్గొండలో 105, రంగారెడ్డిలో 147, భద్రాద్రి కొత్తగూడెంలో 91, ఖమ్మంలో 78, సిద్ధిపేటలో 70, వరంగల్ అర్బన్ లో 89 కరోనా కేసులు నమోదయ్యాయి.