దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 46 లక్షలకు పైగా నమోదయ్యాయి.

 India, Corona, Positive Cases, Deaths-TeluguStop.com

రాష్ట్రాల వ్యాప్తంగా రోజు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.దీంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు కరోనా సోకింది.ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకుతూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

కరోనా నిర్ధారణ పరీక్షల్లో రోజూ 80వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

గడిచిన 24 గంట్లలో దేశవ్యాప్తంగా 83,806 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,30,237కి చేరింది.

నిన్న ఒక్కరోజే దేశంలో 1,054 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.దీంతో మరణించిన వారి సంఖ్య 80,776కి చేరింది.

కరోనా బారిన పడి ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 38,59,400గా ఉంది.ప్రస్తుతం దేశంలో 9,90,061 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వీరిలో కొందరు ఆస్పత్రిలో వైద్యం పొందుతుండగా.మరికొందరు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube