తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.రోజూ రెండు వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,216 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,57,096కి చేరింది.
నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.వీరి సంఖ్య 961కి చేరింది.2,603 మంది కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయ్యారు.దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,24,528కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులున్నాయని, వీరిలో 24,674 మంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 56,217 మంది శాంపిళ్లు సేకరించారు.
దీంతో ఇప్పటివరకూ 21,34,912 శాంపిళ్లు పరీక్షించారు.ఇంకా 2,345 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో నమోదైన కేసులు.హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 341, రంగారెడ్డి 210, మేడ్చల్ మల్కాజ్ గిరి 148, నల్గొండ 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.