దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు….పెరుగుతున్న రికవరీ కేసులతో ఊరట….
ఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.ఒక్క నెలలోనే 26 లక్షల కేసులు, నమోదు కావడం గమనార్హం.
అదే తరహాలో నెల లోనే 33 వేల మరణాలు సంభవించాయి.కానీ ఊరట కలిగించే విషయం ఏమిటంటే కేసులు పెరుగుతున్నప్పటికీ, క్రమంగా రికవరీ కేసులు కూడా పెరగడం ఆశాజనకం.
దేశంలోని మొత్తం కేసుల్లో సెప్టెంబర్ నెలలో నమోదైన కేసులు 40% ఉన్నాయి.వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగించే విషయం.రోజు వారీ కేసులు కూడా 80 వేలకు పైగా నమోదవుతున్నాయి.86,821 కేసులు నిన్న ఒక్క రోజే నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో 1181 మంది మృత్యవాతపడ్డారు.
అదే విధంగా 24 గంటల్లో 85,376 డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియ జేసింది.
దేశ వ్యాప్తంగా మొత్తం 63,12,584 కేసులు నమోదు కాగా,ఇప్పటి వరకు 52,73,201 మంది కోలుకొన్నట్లు వెల్లడించింది.దీంతో రికవరీ రేటు 83.53 శాతం.ఉండగా,మరణాల రేటు 1.56 శాతంగా ఉంది.ఇప్పటి వరకు 7కోట్ల 56 లక్షల కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు ఐసీ ఎం ఆర్ తెలియజేసింది.