దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజూ 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
రికార్టు స్థాయిలో కరోనా కేసులు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది.అధిక సంఖ్యలో కేసులు నమోదవడంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,123 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది.అత్యధిక కేసులు నమోదవడంతో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
గడిచిన 24 గంటల్లో 1290 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 82,961కి చేరింది.కాగా సోమవారం ఒక్కరోజే దేశంలో 82,961 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 39,42,360కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 9,95,933 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కేసులు పెరిగినా రికవరీ రేటు వేరే దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.భారత్ లో కరోనా రికవరీ రేటు 78.53 ఉంటే.మరణాల రేటు 1.63 శాతంగా ఉందన్నారు.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,16,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.