దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుంది.లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రోజు రోజుకు దేశవ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అవుతుంది.
దీనితో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ రోజు రోజుకు మాత్రం ఈ కేసుల సంఖ్యా పెరిగిపోతూనే ఉన్నాయి.ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతుండటం ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది.తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 15,968 పాజిటివ్ కేసులు నమోదు కాగా.465 కరోనా మరణాలు సంభవించినట్లు తెలుస్తుంది.దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,561,83కి చేరుకుంది.ఇందులో 1,83,022 యాక్టివ్ కేసులు ఉండగా.14,476 మంది కరోనాతో మరణించారు.అటు 2,58,684 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గడిచిన 24 గంటల్లో 10,495 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.కాగా, దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక్క మహారాష్ట్రలోనే 1,39,010 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,531 మంది కరోనాతో చనిపోయారు.దేశ రాజధాని ఢిల్లీలో 66,602 కేసులు, 2,301 మరణాలు సంభవించాయి.ఇక తమిళనాడులో అయితే.64,603 కేసులు నమోదు కాగా, 833 మంది మృత్యువాతపడ్డారు.
ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.కాగా, కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్లలో సంభవిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండడం తో కొన్ని రాష్ట్రాలు మరోసారి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలి అని భావిస్తున్నాయి కూడా.