తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు లేటెస్ట్ లెక్కలు హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.గడచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 12,881 మందికి కరోనా సోకినట్లు తెలిపింది.
అంతేకాకుండా గడచిన 24 గంటల్లో కరోనా నుండి 11,987 మంది కోలుకున్నాట్లు…దీంతో దేశంలో తాజాగా నమోదైన కొత్త కేసుల తో కలిపి మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 1,09,50,201కు చేరింది.ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా వలన మృతి చెందిన వారి సంఖ్య చూసుకుంటే 101.మొత్తం మృతుల సంఖ్య చూసుకుంటే 1,56,014.ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,06,56,845 అని ప్రస్తుతం 1,37,342 యాక్టివ్ కేసులు ఉన్నట్లు.
ఈ క్రమంలో కొంతమంది హాస్పిటల్ లో మరికొంతమంది హోమ్ క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు కేంద్ర హెల్త్ బులిటెన్ లెక్కలు బయటపడ్డాయి.